తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్లోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, సమగ్ర మార్పు కోసం ఆలోచించాలని, ఎలాంటి ప్రలోభాలు, డబ్బు, మద్యానికి లొంగకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లోపాల్గొనాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత, ప్రజాస్వామ్యయుత రాష్ట్రంగా వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఉత్తరాఖండ్ సొరంగంలో 17రోజులుగా చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయట పడటంపై హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న41మంది కార్మికులు ఉత్తరాఖండ్లో ఎలాంటి ప్రాణహాని లేకుండా భగవంతుడి ఆశీస్సులతో సురక్షితంగా బయటకు రావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.
కార్మికులకు సొరంగంలో ఉన్నా ఆరోగ్యంగా, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. కార్మికులు సురక్షితంగా బయటకు రావాడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఏజెన్సీలు విశేష కృషి చేశాయని కొనియాడారు. ప్రధాని, ఉత్తరాంచల్ నాయకత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కార్మికుల్ని బయటకు తెచ్చారని తెలిపారు.
More Stories
సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి
జిహాద్ కు, అభివృద్ధికి మధ్య ఎన్నికలు
ఎంఐఎం, కాంగ్రెస్ లకు వేసే ఓటు నేరుగా పాకిస్థాన్కే