ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తామని, ఇందుకోసం ఉన్నత కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గటే సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ రాబోయే రోజుల్లో అధికారికంగానే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దశాబాద్ధాల కాలం పాటు ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పోరాడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఉంది. మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎమ్మార్పీఎస్ అనేక ఉద్యమాలను ముందుండి నడిపించింది.
ప్రదాని మోదీ ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా ఉంటామని ప్రకటించిన ఎమ్మార్పీఎస్ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తోంది. స్వయంగా మందకృష్ణ మాదిగ పలు కార్యక్రమాలకు హాజరవుతూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
తెలంగాణలో ఇప్పటికే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన బీజేపీ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆయా సామాజికవర్గాలకు మరింత దగ్గర కావాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది.
More Stories
జైనూర్ లో గిరిజనులు, ఆదివాసుల ఇళ్లపై దౌర్జన్యం!
ఆదిలాబాద్లో తొలి ట్రిపుల్ తలాక్ కేసు
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదు