
రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ తరపున ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థిగా ప్రకటించిన సత్యనారాయణ అనారోగ్య కారణాలతో పోటీ చేయలేనని చెప్పడంతో అక్కడ కొత్త అభ్యర్థిని ప్రకటించారు.
నామినేషన్లు వేయడానికి శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు ఉండటంతో 8 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ గురువారం ప్రకాశ్ జావడేకర్ స్వయంగా ఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బెల్లంపల్లి (ఎస్సీ రిజర్వుడ్)- కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి దేశ్పాండే రాజేశ్వర్ రావు, మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్గిరి- ఎన్ రామచందర్ రావు, శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్, నాంపల్లి-రవిచంద్ర, చంద్రాయన్ గుట్ట- కే మహేందర్ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.
More Stories
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి
బీసీ కులగణన కాంగ్రెస్ కుట్ర
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం