49- సౌతాఫ్రికాతో మ్యాచ్లో సాధించిన సెంచరీ వన్డే ఫార్మాట్లో కోహ్లీకి 49వది. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. కాగా సచిన్ కంటే వేగంగా కోహ్లీ 49 సెంచరీల మార్కును అందుకున్నాడు. అలాగే కోహ్లీ తన మొదటి వన్డే సెంచరీతోపాటు 49వ వన్డే సెంచరీని కూడా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోనే సాధించడం గమనార్హం.
50- వైట్ బాల్ క్రికెట్లో అనగా వన్డేలు, టీ20ల్లో కలిపి కోహ్లీకి ఇది 50వ సెంచరీ. దీంతో వైట్ బాల్ క్రికెట్లో 50 సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కాగా కోహ్లీ వన్డేల్లో 49 సెంచరీలతోపాటు టీ20ల్లో కూడా ఓ సెంచరీ చేశాడు.
3- ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ప్రపంచకప్లో కోహ్లీ 1,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు.
119- కోహ్లీ సాధించిన సెంచరీ వన్డే ఫార్మాట్లో అతనికి 119వ 50+ స్కోర్ కావడం గమనార్హం. దీంతో వన్డేల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర(118) రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో మాష్టర్ బ్లాష్టర్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా సచిన్ 145 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.
5- వన్డేల్లో సౌతాఫ్రికాపై కోహ్లీకి ఇది ఐదో సెంచరీ. దీంతో ఈ ఫార్మాట్లో సౌతాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు.
7- అంతర్జాతీయ క్రికెట్లో పుట్టిన రోజు నాడు సెంచరీ చేసిన ఏడో బ్యాటర్ విరాట్ కోహ్లీ. భారత్ తరఫున మూడో ఆటగాడు. ప్రపంచకప్లో పుట్టిన రోజు నాడు సెంచరీ సాధించిన మూడో ఆటగాడు. మొత్తంగా కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సనత్ జయసూర్య, రాస్ టేలర్, టామ్ లాథమ్, మిచెల్ మార్ష్ పుట్టిన రోజు నాడు సెంచరీ సాధించారు.
22- వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీకి ఇది 22వ సెంచరీ. దీంతో వన్డేల్లో మొదటి బ్యాటింగ్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ (22)ను సమం చేశాడు.
6046- ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా వన్డేల్లో స్వదేశంలో కోహ్లీ 6 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో స్వదేశంలో వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్గా నిలిచాడు.
1- ఈ మ్యాచ్లో అందుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద్వారా ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కాగా వన్డే ఫార్మాట్లో కోహ్లీకి ఇది 41వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.
55- అంతర్జాతీయ క్రికెట్లో తమ జట్టు గెలిచిన మ్యాచ్ల్లో అత్యధిక సార్లు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్తో కలిసి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు తమ తమ జట్టు గెలిచిన మ్యాచ్ల్లో 55 సెంచరీలు నమోదు చేశారు.
3058- సౌతాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 3 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 58 మ్యాచ్లాడిన కోహ్లీ 3,058 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో సౌతాఫ్రికాపై విరాట్ 1,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
*విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో తొలి సెంచరీని కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోనే కొట్టాడు. తాజాగా సచిన్ రికార్డును సమం చేసే 49వ సెంచరీ సైతం అదే వేదికపై నమోదు చేశాడు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం