మోదీ, అమిత్ షాలతో పాటు 40 మంది స్టార్ కాంపెయిన‌ర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ప్రచారం కోసం 40 మందితో స్టార్ కాంపెయిన‌ర్ల జాబితాను బిజెపి విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ,  నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, స్మ్రితి ఇరానీలకు స్థానం కల్పించింది.
 
అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, పార్టీ నేతలు ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్, రవికిషన్, ఏపీకి చెందిన నేత పురంధేరశ్వరిలను నియమించింది. వీరితో పాటు మాజీ ఎంపీ విజయశాంతి, ఎమ్యెల్యే ఎం రఘునందన్ రావు లను కూడా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి చేర్చారు.
 
అలాగే తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ చోటు కల్పించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డా. కె లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్ లు ఉన్నారు..