అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్న బిఆర్ఎస్, కాంగ్రెస్

బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అబ‌ద్ద‌పు హామీల‌తో మోసం చేసేందుకు వ‌స్తున‌న్నాయ‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేరుతాయని ఆమె భరోసా ఇచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చి మరోసారి అబద్ధపు హామీలతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తప్పుడు హామీలతో మరోసారి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని ఆమె తెలిపారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఐదు గ్యారంటీలు నెరవేర్చడం లేదని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని ఆమె గుర్తుచేశారు.

ఓట్ల కోసం ప్రజలను ముంచాలని అబద్ధాపు హామీలు చెబుతున్నారని  తెలంగాణ ప్రజలు గ్రహించాలని ఆమె కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాతనే ప్రపంచ దేశాల అభివృద్ధి 2014 లో పదకొండవ స్థానంలో ఉన్నదానిని కరోనను ఎదుర్కొని ఆర్థిక స్థితిగతులను అధిగమించి ఐదవ స్థానంలో నిలబెట్టారని అరుణ తెలిపారు.

గద్వాల ప్రజల కోసం గద్వాల నుండి హైదరాబాద్ దాక పాదయాత్ర చేసి నెట్టెంపాడు సాధించానని, అనుక్షణం ప్రజల కోసం పనిచేశానని పేర్కొంటూ అరుణమ్మ ను విమర్శించే సాయి మీది కాదని ఆమె ప్రత్యర్థులపై ధ్వజమెత్తారు. ల్యాండ్ , సాండ్ మాఫియా,లిక్కర్ మాఫియా, భూకబ్జాలు పోవాలంటే బిజెపి పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. 

హైదరాబాద్ లో ఈ నెల 7వ తేదీన జరగనున్న బిసిల సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారని చెబుతూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 11న ఎస్సీల సభను ఏర్పాటు చేస్తున్నారని, ఈ సభలో కూడా ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. కావున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో గద్వాల బిజెపి అసెంబ్లీ అభ్యర్థి బలిగేర శివారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, మండల అధ్యక్షులు పాల్వాయి రాముడు ,అనిమిరెడ్డి, రాజేష్ అయ్య, కౌన్సిలర్ శ్రీరాములు,గుర్రం నరసింహులు,రజక జయశ్రీ, బిజెపి సీనియర్ నాయకులు పులిపాటి వెంకటేష్, అంజిరెడ్డి ,గీత రెడ్డి , తదితరులు ఉన్నారు.