
గత నెల 3వ తేదీన ఈ అంశంపై మైనింగ్ విభాగం నుంచి ఫిర్యాదు అందినట్లు తాజా ఎఫ్ఐఆర్ లో తెలిపారు. మైనింగ్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్రీ శాండ్ పాలసీ విధానం, అమలులో అవకతవకల పై సీఐడీ విచారణ చేపట్టగా ఉచిత ఇసుక పేరుతో సహజ వనరుల హద్దు లేకుండా అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఇచ్చారని సీఐడీ గుర్తించింది.
“గనులు ఖనిజాలకు సంబంధించి 1957లోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. గనులు, ఖనిజాలకు సంబంధించి రెగ్యులేటింగ్ అథారిటీ కేంద్ర ప్రభుత్వమే. అయితే 2014 నుంచి ఇసుక లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. ఆగస్టు 28, 2014న ఇసుక రీచ్లన్నింటినీ ఏపీ ఎండీసీ కి అప్పగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది” అని తెలిపారు.
తర్వాత ఈ రీచ్లను జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించారు. తర్వాత 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేస్తూ కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించారు. కేబినెట్ సబ్కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని జనవరి 15, 2016లో మరొక జీవో జారీచేశారు. టెండర్ కం ఇ-ఆక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. అనూహ్యంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే దీన్నికూడా పక్కపెట్టారు.
ఉచితంగా ఇసుక అంటూ మార్చి 4, 2016ఒక మెమో జారీచేశారు. దీనికి అనుగుణంగా ఏప్రిల్ 6, 2016న జీవో 43 జారీచేశారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఇసుక పాలసీ విషయంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్న రెండునెలల వ్యవధిలోనే మళ్లీ ఈనిర్ణయం తీసుకున్నారని డీఎంజీ వెంకటరెడ్డి సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
ముగ్గురు సీనియర్ నేతలకు బిజెపి షోకాజ్ నోటీసులు