విపక్ష నేతలను ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చు

విపక్ష నేతలను ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చు
దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం కలకలం రేపింది. తమ ఐఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం ఆరోపించారు. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్‌ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్‌ అలర్ట్‌’ సందేశాలు రావడం సంచలనంగా మారింది. 
ఈ అంశంపై విపక్షాలు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఖండించారు. వారిని ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చంటూ వ్యాఖ్యానించారు. ‘విపక్ష నేతలను ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. దానిపై వారు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు.

కాగా, తృణ‌మూల్ ఎంపీ మ‌హువా మొయిత్రా, కాంగ్రెస్ నేతలు ప్రియాంకా చ‌తుర్వేది, శ‌శి థ‌రూర్‌, ప‌వ‌న్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘ‌వ చ‌ద్దా, ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ .. త‌మ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు తెలిపారు. ఫోన్ కంపెనీల నుంచి త‌మ‌కు వార్నింగ్ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు వారు పేర్కొన్నారు. 

ప్రభుత్వంతో లింకున్నసైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ ఫోన్లను హ్యాక్ చేసే ప్రయ‌త్నం చేస్తున్నట్లు త‌మ‌కు మెసేజ్‌లు వ‌స్తున్నట్లు ఆ ఎంపీలు ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఫోన్ కంపెనీల నుంచి త‌మ‌కు వార్నింగ్ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వంతో లింకున్నసైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ ఫోన్లను హ్యాక్ చేసే ప్రయ‌త్నం చేస్తున్నట్లు త‌మ‌కు మెసేజ్‌లు వ‌స్తున్నట్లు ఆ ఎంపీలు ఫిర్యాదులో తెలిపారు.

‘ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్ల నుంచి మీ ఐఫోన్‌కు హ్యాకింగ్‌ ముప్పు ఉన్నది. మీ యాపిల్‌ ఐడీ ద్వారానే మీ ఫోన్‌ను టార్గెట్‌ చేసే అవకాశం ఉన్నదని యాపిల్‌ భావిస్తున్నది. మీ ఫోన్లు హ్యాక్‌ అయితే సున్నితమైన డాటా, కమ్యూనికేషన్లను తస్కరించే ప్రమాదం ఉన్నది. కెమెరా, మైక్రోఫోన్లను యాక్సెస్‌ తీసుకొంటుంది. ఇది హెచ్చరిక నకిలీ కూడా కావొచ్చు. అయినప్పనటికీ దీన్ని సీరియస్‌గా తీసుకోండి’ అని ఆ సందేశం సారాంశం. దీనిపై రాజకీయ దుమారం రేగింది.

పలువురు ఎంపీలు, నేతలు తమ ఫోన్లకు వచ్చిన ఈ నోటిఫికేషన్‌ స్క్రీన్‌షాట్లను మంగళవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. విపక్ష పార్టీల ఎంపీల ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నదని దుమ్మెత్తిపోశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్‌ హ్యాకింగ్‌ అలర్ట్‌ సందేశాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

విపక్షాల ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం గొప్పగా పురోగమించడాన్ని చూడలేకనే విపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అలర్ట్‌ నోటిఫికేషన్లు భారత్‌లో మాత్రమే గాక, 150 దేశాల్లోని యూజర్లకు వచ్చినట్టు యాపిల్‌ వర్గాలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని చెబుతూ ఈ సందేశాలు వచ్చిన వారు దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు.

కాగా, హ్యాకింగ్‌ అలర్ట్‌ వివాదంపై ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ స్పందిస్తూ కొన్ని యాపిల్‌ నోటిఫికేషన్లు నకిలీ కూడా కావొచ్చని పేర్కొన్నది. కొన్ని దాడులను గుర్తించలేం కూడా అని తెలిపింది. అయితే విపక్ష ఎంపీలకు హ్యాకింగ్‌ సందేశాలు ఎందుకు వచ్చాయన్నది మాత్రం చెప్పేందుకు యాపిల్‌ నిరాకరించింది. ‘ఈ అలర్ట్‌ నోటిఫికేషన్‌ జారీచేయడానికి గల కారణాలను మాత్రం మేం వెల్లడించలేం. ఎందుకంటే, దాన్ని బయట పెడితే హ్యాకర్లు భవిష్యత్తులో మా నిఘా నుంచి తప్పించుకొనే అవకాశముంది’ అని స్పష్టం చేసింది.

దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లపై ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్ల దాడి వివాదంపై యాపిల్ ప్రతినిధులను పిలిపించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాజలీకి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యోచిస్తున్నట్లు కమిటీ సెక్రటేరియట్ అధికారి ఒకరు వెల్లడించారు.