మలయాళ టీవీ, సినీ నటి రేంజుషా మీనన్ (35) కన్నుమూశారు. తిరువనంతపురంలోని శ్రీకార్యంలో ఉన్న తన ఫ్లాట్లో ఆమె సోమవారం ఉరి వేసుకున్నారు మీనన్. టీవీ నటుడు అయిన తన భర్త మనోజ్తో కలిసి ఉంటున్న ఫ్లాట్లోనే ఆమె మరణించారు. ఫ్లాట్లోని బెడ్రూమ్లో తన చీరతోనే రేంజుషా మీనన్ ఉరి వేసుకున్నారు.
ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఆర్థిక సమస్యల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కొచ్చి నుంచి వచ్చిన రేంజుషా మీనన్ ముందుగా ఓ మలయాళ టీవీ ఛానెల్లో యాంకర్గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత టీవీ సీరియళ్లలో నటించారు.
‘స్త్రీ’ అనే సీరియల్తో ఆమె తెరంగేట్రం చేశారు.
ఆ తర్వాత చాలా సీరియళ్లు, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. చివరగా ఆనందరాగం సీరియల్లో ఆమె కనిపించారు. ఇంటే మతావు, మిసెస్ హిట్లర్ సహా మరిన్ని టీవీ సీరియళ్లలో మంచి క్యారెక్టర్లు చేసిన రేంజుషా మీనన్ బాగా పాపులర్ అయ్యారు. సిటీ ఆఫ్ గాడ్, మెరిక్కిందోరు కుంజడు సహా మరిన్ని మలయాళ సినిమాల్లోనూ ఆమె నటించారు. సెలెబ్రిటీల వంటల షో సెలెబ్రిటీ కిచెన్ మ్యాజిక్లోనూ ఆమె పాల్గొన్నారు. రేంజుషా మీనన్ కొన్ని సీరియళ్లకు నిర్మాతగానూ వ్యవహరించారు. అలాగే, ఆమె ప్రొఫెషనల్ భరతనాట్యం డ్యాన్సర్ కూడా.
కన్నుమూసే కొన్ని గంటల ముందు కూడా ఇన్స్టాగ్రామ్లో ఆమె ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేశారు. ఆనందరాగంలో తనతో పాటు నటిస్తున్న శ్రీదేవి అనిల్తో చేసిన వీడియోను పోస్ట్ చేశారు. కాగా, గత నెల మలయాళ నటి అపర్ణ నాయర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని సీరియళ్లు, సినిమాల్లో నటించిన ఆమె తన ఇంట్లోనే ఉరివేసుకున్నారు.
More Stories
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే!
ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ పిఎ దాడి!
కొత్త ప్రభుత్వానికి 100 రోజుల మాస్టర్ ప్లాన్!