271 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది దక్షిణాఫ్రికా. ఐడెన్ మార్క్రమ్ (91) అదరగొట్టడంతో ఓ దశలో దక్షిణాఫ్రికా సులువుగా గెలిచేలా కనిపించింది. అయితే, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి టెన్షన్లో పడింది. చివర్లో కేశవ్ మహారాజ్ (7 నాటౌట్) విలువైన పరుగులు చేసి సఫారీ జట్టును గెలిపించాడు. దీంతో ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
పాకిస్థాన్ బౌలర్లలో షహిన్ షా అఫ్రిది మూడు, హరిస్ రవూఫ్, మహమ్మద్ వాసిమ్, ఉసామా మిర్ చెరో రెండు వికెట్లు తీశారు. చివరి వరకు పోరాడి ఓడింది పాక్. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (52) అర్ధ శతకాలు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ తబ్రైజ్ షంసి నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లతో రాణించాడు.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి