కాగా, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో క్రాకర్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ దేశ రాజధాని పరిసరాల్లో కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా క్రాకర్స్ పై, డీజిల్ తో నడిచే బస్సులపై నిషేధం విధించాలని కోరారు. చలికాలంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఎన్ సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లో కాలుష్యాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంటల్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం, ఢిల్లీలో ఏర్పడుతున్న కాలుష్యంలో 31 శాతం రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి ఏర్పడగా, 69 శాతం ఎన్ సీఆర్ రాష్ట్రాల నుంచే వస్తోంది. ఎన్ సీఆర్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాల్లో కాలుష్యాన్ని నియంత్రించకపోతే ఢిల్లీలో పరిస్థితి మారదని రాయ్ స్పష్టం చేశారు.
బాణసంచా, చెత్తను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో కాలుష్య ఇంధనాలను ఫైన్డ్ నేచురల్ గ్యాస్ గా మార్చాలని, ఇటుక బట్టీల పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి జిగ్ జాగ్ టెక్నాలజీ ఉపయోగించాలని, డీజిల్ జనరేటర్లపై ఆధారపడకుండా ఎన్ సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉంచాలని కోరారు.
కాలుష్య నియంత్రణే ధ్యేయంగా గత శుక్రవారం ఢిల్లీలో ‘రన్ అగైనెస్ట్ పొల్యూషన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో వాహన కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ‘రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్’ ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బాణసంచా ద్వారా ఏర్పడే కాల్చడాన్ని తగ్గించేందుకు ‘పటాకే నహీ.. దియే జలావో’ అనే ప్రజా చైతన్య ప్రచారాన్ని మళ్లీ ప్రవేశపెట్టబోతోంది.
More Stories
మూడు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం