మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనకు చైనా మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బీజింగ్ తన ప్రపంచ ప్రభావాన్ని విస్తరించడానికి ఉపయోగిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ప్రతిష్టాత్మక మైలురాయి ప్రాజెక్ట్ ఫోరమ్ కోసం చైనా ఈ వారం 130 దేశాల ప్రతినిధులను స్వాగతించింది.
పుతిన్ బుధవారం చర్చల కోసం జిన్పింగ్ను కలవబోతున్నారు. ఈ చర్చలలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. కాగా, ఇరు దేశాల అధినేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించింది.
2017, 2019లో కూడా బీఆర్ఐ సదస్సుకు ఇండియా దూరంగా ఉన్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా 6 వేల కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన చైనా- పాక్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సాగడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే దీనికి కారణం.
కాగా, యుద్ధ నేరాల కేసులో పుతిన్ను అంతర్జాతీయ కోర్టు దోషిగా నిర్ధారించింది. రష్యా అధినేత అరెస్టుకు గత మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో పుతిన్ గత కొన్ని రోజులు విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. గత నెలలో భారత్ వేదికగా జరిగిన జీ20 సమావేశాలకు కూడా హాజరుకాలేదు.
More Stories
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్