![](https://nijamtoday.com/wp-content/uploads/2023/10/Indo-Canada-ministers.webp)
ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆరోపించడమే కాకుండా.. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టపై బురదజల్లే ప్రయత్నం చేసిన కెనడాకి, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కేవలం ప్రకటనలతో సరిపెట్టాయి. న్యూజిలాండ్ అయితే ప్రకటన కూడా చేయలేదు.
ఈ అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తొందరపాటుతో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెనడా ఆరోపణలను ఖండించిన భారత్, ఈ విషయంలో తమకు ఆధారాలు ఇస్తే పరిశీలిస్తామని ప్రకటించింది. తదనంతర పరిణామాలతో కెనడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కొన్ని రోజుల క్రితం వాషింగ్టన్ లో చర్చలు జరిపినట్టు సమాచారం.
ఈ విషయాన్ని బ్రిటిష్ వార్తా పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది. కాకపోతే ఈ భేటీని కెనడా, భారత్ ధ్రువీకరించలేదు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో కొన్ని రోజుల కిందట వారిద్దరూ భేటీ అయ్యి సంక్షోభాన్ని నివారించడంపై చర్చించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అంశాన్ని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్టు మెలానీ ఈ నెల మొదట్లో ప్రకటించారు.
ఖలిస్థానీ హత్య విషయంలో భారత్పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ ఆ దేశంలో దారుణంగా పడిపోయిందని, ఆయన రేటింగ్ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి దిగజారిందని ఎన్డీటీవీ సర్వేలో వెల్లడైంది. భారత్లో కెనడా సంబంధాలు ముఖ్యమని 62 శాతం మంది అభిప్రాయపడగా, ట్రూడో ఆరోపణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని 65 శాతం మంది చెప్పారు.
More Stories
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్
ఆసియాకప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్, శ్రీలంక
కమలా హరిస్కు ఒబామా దంపతుల మద్దతు