ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య ఆ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాల తాజా రిపోర్ట్ సంచలనంగా మారింది. భారత్, కెనడాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర చేసిందని ఆ నివేదిక పేర్కొంది. దీని కోసం చాలా నెలల క్రితం నుంచే నిజ్జర్ హత్యకు ప్లాన్ వేసినట్లు తెలిపింది.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్కు కెనడాలో ఉంటున్న పాక్ ఐఎస్ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలున్నాయి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఐఎస్ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్పై ఒత్తిడి పెంచుతోంది. కానీ అతడు మాత్రం ఖలిస్థానీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. ఇక స్థానికంగా పాప్యులారిటీ పెంచుకున్న అతడు డ్రగ్స్ అక్రమ దందాను నియంత్రిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కక్ష పెంచుకున్న ఐఎస్ఐ, నిజ్జర్ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. దీనికోసం ఇద్దరు ఏజెంట్లకు ఈ బాధ్యతను అప్పగించినట్టు నిఘా వర్గాల సమాచారం.
ఇక కెనడాలో నిజ్జర్ ఉంటున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఐఎస్ఐ మాజీ అధికారులు నివసిస్తున్నట్టు తెలిసింది. వీరి ద్వారానే నిజ్జర్ కదలికలను తెలుసుకున్నట్టు సమాచారం. బ్రిటిష్ కొలంబియా లోని సర్రే స్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏడాది జూన్లో నిజ్జర్ను కాల్చి చంపారు.
More Stories
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్