ఈ దాడి విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్పై చేస్తున్న నౌకాదళ దాడులను రష్యా మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచే పర్యవేక్షిస్తున్నది. కాగా, దాడిలో 9 మంది మృతి చెందడమేగాక, 16 మంది గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని రష్యా ఇంకా ధ్రువీకరించలేదు.
మరోవంక, ఉక్రెయిన్కు సుదీర్గ దూరం ప్రయాణించే క్షిపణులను అందించేందుకు అమెరికా సిద్దమైంది. దీనికి సంబంధించిన ప్రణాళికల్ని ఆ దేశం తయారు చేసింది. ఏటీఏసీఎంఎస్ క్షిపణుల్ని ఉక్రెయిన్కు అందించేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు అమెరికా ఈ సాయం చేయనున్నది.
ఏటీఏసీఎంఎస్(ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ మిస్సైళ్లు సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఫ్రంట్లైన్ వద్ద నుంచి రష్యా భూభాగంలో దూరంగా ఉన్న టార్గెట్లను చేధించేందుకు ఆ మిస్సైళ్లతో ఉక్రెయిన్కు సులువు అవుతుందని అంచనా వేస్తున్నారు.
శుక్రవారం రోజున రష్యాలోని నల్ల సముద్రంలో ఉన్న నౌకలను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ ఓ మిస్సైల్ను వదిలింది. సెవాస్తిపోల్పై స్టార్మ్ షాడో మిస్సైళ్లతో దాడి జరిగినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఆ క్షిపణుల్ని సరఫరా చేస్తున్నాయి. ఆ మిస్సైళ్లు సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించగలవు.
More Stories
ఇజ్రాయిల్ లో `అల్జజీరా’ కార్యాలయాల మూసివేత
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్