
తెలుగు రాష్ట్రాల్లో గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థులు గ్లాస్ గుర్తు పైనే పోటీ చేశారు. ఏపీలోని 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేసేందుకు జనసేన పార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని పవన్ తెలిపారు.
ఈ తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే గతంలో గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ లిస్ట్ లో పెట్టడంతో జనసేనకు ఇకపై గాజు గ్లాస్ గుర్తు ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును కేంద్రం ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది.
దీంతో జనసేన కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందారు. ఇన్నాళ్లు పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసు సింబల్ వచ్చే ఎన్నికల్లో జనసేనకు వస్తుందో? లేదో? అని ఆందోళన చెందారు. అయితే, జనసేన అభ్యర్థన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా గాజు గ్లాస్ సింబల్ ను జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
More Stories
మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను
త్వరలో రూ.500 కోట్లతో తిరుపతి మోడల్ బస్ స్టేషన్
కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న తిరుమల.. హైకోర్టు ఆందోళన