
దీనికి బదులుగా ప్రతిభ ఆధారిత వీసాల మంజూరీకి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇప్పుడున్న వీసాల కార్యక్రమం అంతటిని ప్రక్షాళించాల్సి ఉందంటూ ఇప్పటి హెచ్ 1 బి వీసా పద్థతి కేవలం ఆయా కంపెనీలకే లాభసాటిగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న వివేక్ ప్రచార దశల్లో పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టి పోటీ ఇస్తున్నారు.
భారతీయ సంతతికి చెందిన వాడని మనం గర్వపడుతుంటే వివేక్ రామస్వామి తన కార్యాచరణ ప్రకటనతో భారతీయ ఐటి ప్రొఫెషనల్స్ గుండెల్లో విమానాలు పరుగెత్తించారు. అమెరికాలో ఉద్యోగాలకు ఇండియన్ ఐటి యువత ఎక్కువగా ఈ తాత్కాలిక వీసా ఉద్యోగ విధానం హెచ్ 1 బి వీసాపైనే ఆధారపడుతున్నారు. ప్రత్యేకించి భారతీయ ఐటి యువతనే అమెరికా కంపెనీలు ఎక్కువగా ఈ వీసా ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. తాను ఈ వీసాను 29 పర్యాయాలు వాడుకున్నానని వివరించారు.
కాగా రామస్వామికి చెందిన పూర్వపు కంపెనీ రోవియంట్ సైన్సెస్ 2018 నుంచి 2023 వరకూ ఈ హెచ్ 1 బి వీసా కిందనే 29 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. అయితే సంబంధిత ప్రక్రియను వాడుకోవడం , దీనిని వాడుకున్న వారు పాటిస్తున్న చెడు విధానమే అవుతుందని ఈ 38 సంవత్సరాల బయోటెక్ పారిశ్రామికవేత్త తెలిపారు.
ఇంతకు ముందు జరిగిన ప్రచార ఘట్టం దశలో వివేక్ రామస్వామి తాను అధికారంలోకి వస్తే 75 శాతం ప్రభుత్వోద్యోగాలపై వేటేస్తానని, ఎఫ్బిఐవంటి పలు సంస్థలను రద్దు చేస్తానని చెప్పారు. ఇప్పుడున్న లాటరీ వీసా పద్ధతి తొలిగిపోవాలనేదే తన ఆలోచన అని స్పష్టం చేశారు.
ప్రతిభను లెక్కలోకి తీసుకునే ఇతర దేశాల ఐటి ఉద్యోగులను అమెరికాకు అనుమతించాల్సి ఉందని తెలిపారు. గొలుసు కట్టు వలసలను అరికట్టాలనేదే తమ విధానం అని ప్రకటించారు. హెచ్ 1 బి వీసాల పద్ధతిపై మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యతిరేకతను చాటుకున్నారు. ఈ ప్రాతిపదికన వీసా మంజూరీని గణనీయంగా తగ్గించారు.
More Stories
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
అమెరికా వచ్చే ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయుడే
ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం