సిక్కుల శాశ్వత గురువు, ఆది గ్రంధం శ్రీ గురు గ్రంథ సాహిబ్ జీ

 
* శ్రీ గురు గ్రంథ సాహిబ్ జీ ప్రకాష్ ఉత్సవ్
 
గురు గ్రంథ్ సాహిబ్ ప్రపంచంలోని గొప్ప గ్రంథాలలో ప్రత్యేకమైనది. దీనిని జీవించి ఉన్న వ్యక్తి కంటే అత్యున్నత ఆధ్యాత్మిక అంశంగా పరిగణిస్తారు.  సిక్కు మతానికి అధిపతిగా పరిగణిస్తారు. ఇది దాని మత స్థాపకుల రచనలను మాత్రమే కాకుండా వారి విశ్వాసం ఉన్న వ్యక్తుల రచనలను కూడా కలిగి ఉన్న ఏకైక పుస్తకం. సిక్కుల సజీవ గురువు. 
 
 ఈ గ్రంధాన్ని సిక్కులు చాలా గౌరవప్రదంగా పరిగణిస్తారు. అత్యంత గౌరవంతో చూస్తారు. గురు గ్రంథ్ సాహిబ్ జీ అనేది సిక్కు గురువులు, ఇతర సాధువులతో సహా అనేక విభిన్న పండితుల నుండి అనేక శ్లోకాలు, పద్యాలు, షాబాద్, ఇతర రచనల సంకలనం. గురు గ్రంథ్ సాహిబ్ జీ 1,430 పేజీలను కలిగి ఉంది.  ప్రతి కాపీ ఒకే విధంగా ఉంటుంది.
 
ఇందులో గురువులు చెప్పిన మాటలు ఉన్నాయి. దీనిని గుర్బానీ అని పిలుస్తారు. అంటే ‘గురువు నోటి నుండి’ అని అర్ధం. ఇది దేవుని వాక్యంగా పరిగణిస్తారు. ఇది గురుముఖిలో వ్రాయబడింది. ఇది పంజాబీ భాష వ్రాయబడిన లిపి. గురు అర్జన్ దేవ్ జీ, ఐదవ సిక్కు గురువు గురు గ్రంథ్ సాహిబ్ జీ అసలైన సంస్కరణను సంకలనం చేశారు.
 
గురు అర్జన్ దేవ్ జీ సిక్కులకు తమ గురువుల శ్లోకాల ప్రామాణికమైన సంకలనం అవసరమని భావించారు. ఆ విధంగా గురు అర్జన్ దేవ్ అందరు గురువుల అసలు శ్లోకాల సేకరణను ప్రారంభించారు. ఆయన అసలైన వ్రాతప్రతులుల కోసం దేశవ్యాప్తంగా భాయ్ పియారా, భాయ్ గురుదాస్,  బాబా బుద్ధ  వంటి నమ్మకమైన సిక్కులను పంపారు.
 
గురు అర్జన్ దేవ్ గోయింద్వాల్, ఖదూర్, కర్తార్‌పూర్‌లకు పూర్వ గురువుల కుటుంబాలను సందర్శించడానికి వెళ్లారు. గురు అర్జన్ దేవ్ మోహన్, (గురు అమర్ దాస్ జీ కుమారుడు), దాతు జీ (గురు అంగద్ జీ కుమారుడు), అలాగే శ్రీ చాంద్ జీ (గురునానక్ జీ కుమారుడు) నుండి గురువుల అసలు వ్రాతప్రతులను సేకరించారు.
 
గురునానక్ జీ అనేక కీర్తనలు, ప్రార్థనలను గురు అంగద్, గురు అర్జన్ దేవ్ భద్రపరిచారు. ఈ సేకరణకు ఆది గ్రంథంగా పేరు వచ్చింది. ఆది గ్రంథంలో కబీర్, రవిదాస్, నామ్ దేవ్, షేక్ ఫరీద్ వంటి 36 మంది హిందూ, ముస్లిం రచయితల రచనలు కూడా ఉన్నాయి.
 
దీనిని వ్రాసే సమయంలో, గురు గ్రంథ్ సాహిబ్ జీ, గుర్బానీ ముస్లింలపై ద్వేషాన్ని బోధించారని ఒక పుకారు వ్యాప్తి చేయడం ద్వారా కొంతమంది మొఘల్ చక్రవర్తి జహంగీర్ మనస్సును విషపూరితం చేశారు. కోపోద్రిక్తుడైన జహంగీర్ గురు గ్రంథ్ సాహిబ్ జీ వ్రాతప్రతులలోని కొన్ని శ్లోకాలను తొలగించమని గురు అర్జన్ దేవ్ని ఆదేశించాడు. పైగా, రూ. 200,000 జరిమానా విధించాడు.
 
గురు అర్జన్ దేవ్ అప్రియమైన వచనాన్ని తొలగించడానికి లేదా జరిమానా చెల్లించడానికి నిరాకరించారు. గురు అర్జన్ దేవ్ జహంగీర్‌కి అవసరమైన విధంగా శ్లోకాలలో మార్పులు చేయడాన్ని వ్యతిరేకించారు. బదులుగా అమరవీరునిగా మరణానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది అతని ఉరి తీయడానికి దారితీసింది.
 
ఆది గ్రంథం 1604లో పూర్తయింది. స్వర్ణ దేవాలయంలో దీనిని భద్రపరిచారు. 1708లో, ఆది గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీగా మారింది, గురు గోవింద్ సింగ్ ద్వారా ప్రకటించిన సిక్కుల శాశ్వత గురువుగా మనుగడ సాగిస్తున్నది. 1708లో గురు గోవింద్ సింగ్ జీబలిదానం తర్వాత, బాబా దీప్ సింగ్, భాయ్ మణి సింగ్ పంపిణీ కోసం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అనేక ప్రతులను సిద్ధం చేశారు.
 
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అసలు రూపాన్ని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ నగరంలో చూడవచ్చు. ఇతర గురుద్వారాలలో ఉంచిన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్  ఈ ఎడిషన్ ప్రతులు మాత్రమే. గురు గ్రంథ్ సాహిబ్ జీ మొదటి శబ్దం “మూల మంత్రం”. ఇది సిక్కు మతానికి గుర్తింపునిచ్చే ప్రకటన. ఇది ఒక్క దేవుడిపై ఉన్న నమ్మకాన్ని నొక్కి చెబుతుంది.
 
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ మొదటి పంక్తి “ఇక్ ఓంకార్”. అంటే ‘దేవుడు ఒక్కడే’ అని అర్థం. గురు గోవింద్ సింగ్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీని శాశ్వత గురువు హోదాకు పెంచారు. 1708లో “సిక్కుల గురువు” అనే బిరుదును ప్రదానం చేశారు. గురు గోవింద్ సింగ్ గురు గ్రంథ్ సాహిబ్ జీని తదుపరి, శాశ్వతమైన గురువుగా పరిగణించాలని సిక్కులకు  ఆజ్ఞాపించారు. “సబ్ సిఖాన్ కో హుకమ్హై గురు మన్యో గ్రంథ్” అంటే సిక్కులందరూ గ్రంథాన్ని గురువుగా పరిగణించాలని ఆజ్ఞాపించారని ఆయన పేర్కొన్నారు.
* శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ  ప్రకాష్ ఉత్సవ్ పంజాబీ క్యాలెండర్‌లో ఆరవ నెల అయిన భాడోన్ యొక్క 15వ రోజు (అమావాస్య)న జరుగుతుంది. ఇది పాశ్చాత్య క్యాలెండర్‌లో ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వస్తుంది.