ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ కు ఆదివారం వర్షంతో అంతరాయం ఏర్పడింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. అయిత సోమవారం రిజర్వ్ డే ఉండడంతో 50 ఓవర్ల ఆటకు అవకాశం ఉంది. భారత జట్టు 24.1వ ఓవర్తో యథావిధిగా ఇన్నింగ్స్ కొనసాగించనుంది. వర్షం తగ్గడంతో 8. 30 నిమిషాలకు అంపైర్లు పిచ్ను పరిశీలించడానికి వెళ్లారు.
అప్పటికే గ్రౌండ్ సిబ్బంది ఫ్యాన్లతో పిచ్, ఔట్ ఫీల్డ్ను ఆరబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆలోపే మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో, అంపైర్లు ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్ రద్దు చేశారు. తిరిగి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇదే స్టేడియంలో 50 ఓవర్ల ఆట కొనసాగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత ఇన్నింగ్స్ ధాటిగా సాగుతున్న సమయంలో మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు.
24.1వ ఓవర్ సమయంలో వాన మొదలైంది. అప్పటికీ భారత్ 147/2 తో పటిష్ట స్థితిలో ఉంది. విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(56 : 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు), శుభ్మన్ గిల్(58 : 52 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు.
More Stories
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి
కొవిషీల్డ్తో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు