రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారతీయ సమన్వయ బైఠక్ (అఖిల భారత్ కో ఆర్డినేషన్ సమావేశం) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంవత్సరం జరగబోతోందని అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు ఈ మూడు రోజుల సమన్వయ సమావేశం సెప్టెంబర్ 14 నుండి16 వరకు జరుగుతుందని చెప్పారు.
సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీతో పాటు మొత్తం ఐదుగురు సహ సర్ కార్యవహ్ లు, ఆర్ఎస్ఎస్ ఇతర ముఖ్య బాధ్యతలలో ఉన్నవారు ఈ సమావేశానికి హాజరవుతారు. దాదాపు 36 ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సంస్థల ముఖ్య ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
వీటిలో, రాష్ట్ర సేవికా సమితి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా పార్టీ, భారతీయ కిసాన్ సంఘ్, విద్యా భారతి, భారతీయ మజ్దూర్ సంఘ్, సంస్కార్ భారతి, సేవా భారతి, సంస్కృత భారతి, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ వంటి ప్రధాన సంస్థల ప్రతినిధులు ఈ వార్షిక సమావేశాలలో పాల్గొంటారు.
ఈ సంస్థలు, వాటి ప్రతినిధులు సామాజిక జీవితంలోని వివిధ రంగాలలో సేవాభావం, అంకితభావం, దేశభక్తితో చురుకుగా పనిచేస్తున్నారు. గతేడాది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఈ సమన్వయ్ బైఠక్ జరిగింది. పాల్గొనేవారు సామాజిక జీవితంలోని వివిధ అంశాలలో తమ అనుభవాలు, కార్యకలాపాలను వివరంగా చర్చిస్తారు.
ప్రస్తుత జాతీయ దృష్టాంతంతో పాటుగా సామాజిక సామరస్యం, పర్యావరణం, కుటుంబ విలువలు, సేవా పని, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై విస్తృతమైన చర్చలు, మరియు అభిప్రాయాల మార్పిడి జరుగుతుంది. సామాజిక పరివర్తనకు తోడ్పడే వివిధ కార్యక్రమాలపై కూడా చర్చలు జరగనున్నాయని అంబేకర్ వివరించారు.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్