జో బైడెన్ భార్య జిల్ బైడెన్ కు కరోనా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ (72) కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆమెకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

డెలావర్ లోని రెహోబోత్ బీచ్ ప్రాంతంలో ఉన్న నివాసంలో ఆమె ఉన్నారని వెల్లడించింది. ఏడాది క్రితం కూడా ఆమె కరోనా బారిన పడింది. ఈ క్రమంలో 80 ఏళ్ల జో బైడెన్ కు కూడా సోమవారం సాయంత్రం కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అయితే, ఆయనకు నెగెటివ్ అని తేలింది. 

జిల్ బైడెన్ కు కోవిడ్ సోకిన కారణంగా జో బైడెన్ కు రెగ్యులర్ గా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తారని, కరోనా లక్షణాలను పరిశీలిస్తారని వైట్ హౌస్ తెలిపింది. మరోవైపు అమెరికాలో తాజాగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 

అయితే మ‌రో రెండు రోజుల్లో ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న జీ20 స‌మావేశాల‌కు జో బైడెన్ హాజ‌రవుతారా? లేరా? అన్న అంశంపై సందిగ్ధత వ్య‌క్తం నెలకొంది. ఆయన నాలుగు రోజుల భారత్ పర్యటనకు గురువారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. మరోవంక 2024 అధ్యక్ష ఎన్నికలకు తలబడుతున్న బిడెన్  ప్రధానంగా వయోభారం, ఆరోగ్యం ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు.