దేశ ప్రగతి అన్నది విద్యార్థుల మీద ఆధారపడి ఉంటుందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శ్రీ విద్యారణ్య ఇంటర్ నేషనల్ స్కూల్ (స్విస్) నిర్వహించిన ఇన్ స్పైర్ ఇండియా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ప్రతీ విద్యార్థి చక్కని ఆశయాల్ని ఏర్పరచుకొని, వాటి సాధన కోసం కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.
విద్యార్థుల సంస్కారాన్ని బట్టి వారి గురువుల్ని గుర్తించగలుగుతామని చెప్పారు. ఈనాడు ప్రపంచదేశాలన్ని మన దేశము వైపే చూస్తున్నాయని చెబుతూ సృజనాత్మకంగా ఆలోచిస్తూ నైపుణ్య భారతదేశమును నిర్మించాలని సతీష్ రెడ్డి కోరారు. త్వరలోనే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని పేర్కొంటూ చాలా తక్కువ కాలంలోనే భారత్ ప్రగతి దిశగా పరుగులు తీస్తోందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా స్విస్ పాఠశాల ప్రగతి గురించి వివరణాత్మకంగా అడిగి తెలుసుకున్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన విద్యా భారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించేందుకు శ్రీ సరస్వతీ విద్యాపీఠం చేస్తున్న కృషిని వివరించారు. దేశము , సమాజము గురించి ఆలోచించేవారిగా విద్యార్థుల్ని తయారుచేయటంలో శిశుమందిరాల పాత్రను పరిచయం చేశారు.
శిశు మందిరములలో చదివిన పూర్వ విద్యార్థులు అంకిత భావముతో అనేక రంగములలో దేశానికి, సమాజానికి సేవలు అందిస్తున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు. విద్యా భారతి క్షేత్ర కోశాధికారి పసర్తి మల్లయ్య, ప్రిన్సిపాల్ గోకులన్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్