జగన్పై దాడి కేసులో కుట్ర, రాజకీయ కోణమే ఉందని న్యాయవాది సలీం ఆరోపించారు. విజయవాడ నుంచి బదిలీ అయిన తర్వాత తొలిసారి కోడికత్తి కేసుపై విశాఖ ఎన్ఐఏ న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరిగింది. రాజకీయాల కోసమే కేసును వాయిదాలు వేస్తూ సాగదీస్తున్నారని విమర్శించారు.
కేసు విచారణ వేగంగా జరగడానికి ‘రావాలి జగన్.. చెప్పాలి వాదన.. ఇవ్వాలి ఎన్వోసీ’ అని స్పష్టం చేశారు. దాడి కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ తేల్చిందని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై కేసు విచారణ ఇన్నాళ్లు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సాగింది.
కొత్త కోర్టు ఏర్పాటైన నేపథ్యంలో విచారణను విశాఖకు బదిలీ చేయడంతో తొలిసారి విచారణ జరిగింది. వాదనల అనంతరం విచారణ సెప్టెంబరు 6కు వాయిదా పడింది. ఇప్పటివరకు విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులను పరిశీలించి విచారణ ముందుకు తీసుకెళ్లడానికి సెప్టెంబరు 18 వరకు గడువునివ్వాలని ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధిరాములు న్యాయస్థానాన్ని కోరారు.

More Stories
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు