
కాగా, ప్రస్తుతం నైజర్ గగనతలాన్ని మూసివేశారని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల గుండా వెళ్లే వారు భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే నైజర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వారు పునరాలోచించుకోవాలని చెప్పారు. ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని కోరారు.
నైజర్లో సుమారు 250 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. వారంతా భారత ఎంబసీలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కోరారు. భారతీయులు సురక్షితంగా ఆ దేశాన్ని వీడేందుకు భారత ఎంబసీ తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన వెల్లడించారు.
మరోవైపు నైజర్లో జూలై 26న సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ను ఆర్మీ నిర్బంధించింది. అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది. అయితే సైనిక తిరుగుబాటుపై ఆ దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. శాంతి ఒప్పందాలకు ఆర్మీ చీఫ్ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ తిరుగుబాటు నాయకుడు, రాజకీయ నేత రిస్సా అగ్ బౌలా, సైనిక ప్రభుత్వంపై ఉద్యమం ప్రారంభించారు.
అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తామని బుధవారం బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వర్గానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫర్ రిపబ్లిక్ (సీఆర్ఆర్) ఫోర్స్, ఆర్మీ మధ్య పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నైజర్లో ఉన్న భారతీయులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది.
More Stories
విద్యార్థుల వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి