భూమికి 46 కి.మీల దిగువన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. కాగా జపాన్ భూకంపం ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం సంభవించలేదు. భూకంపం కారణంగా ప్రజలు భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జపాన్లో తరచుగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. ప్రజలు నిత్యం భయంతో జీవిస్తుంటారు.
మరోవైపు టర్కీలోనూ భూకంపం సంభవించింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మొలాజికల్ సెంటర్ ప్రకారం మలత్యా ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల 48 నిమిషాలకు భూమి కంపించింది. భూమికి 10 కి.మీల దిగువన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది.
“మలత్యాకు 10కి.మీల దూరంలో భూకంపం నమోదైంది. పలు భవనాలు ఊగిపోయాయి. ఆస్థి, ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది,” అని అధికారులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం టర్కీ భూకంపంలో 23మంది ప్రజలు గాయపడ్డారు. చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడానికి భవనాల నుంచి బయటకు దూకేశారు. పలు భవనాలు దెబ్బతిన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భారీ భూకంపం నుంచి టర్కీ ఇంకా కోలుకోలేదు. ఫిబ్రవరిలో దాదాపు 4,5 భూకంపాలు ప్రజలను భయపెట్టాయి. అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. వేర్వేరు ఘటనల్లో మృతుల సంఖ్య దాదాపు 50 వేలుగా నమోదైంది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
More Stories
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి