న్యూక్లియర్ స్ట్రాటజీలో చైనా తన విధానాన్ని మార్చుకున్నదని, అందుకే ఆ దళానికి చెందిన అత్యున్నత నేతల్ని మార్చివేసినట్లు తెలుస్తోందని భావిస్తున్నారు. పీఎల్ఏను అసాధారణ రీతిలో జిన్పింగ్ నియంత్రిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే, టాప్ ర్యాంకుల్లో ఉన్న నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, దాని పట్ల జిన్పింగ్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ఎన్పీటీ సమావేశంలో చైనా పాల్గొన్నది. అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు తమ బాధ్యతల్ని గుర్తుంచుకోవాలని, నిరాయుధీకరణలో భాగంగా కొత్త ఒప్పందాన్ని అమలు చేయాలని చైనా పేర్కొన్నది. ఆ సమావేశాల్లో చైనా విదేశాంగ శాఖకు చెందిన ఆర్మ్స్ కంట్రోల్ శాఖ డైరెక్టర్ జనరల్ సున్ జియాబో మాట్లాడారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియలో న్యూక్లియర్ పవర్ దేశాలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
పాక్ కు అండగా ఉంటాం
మరోవంక, అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా పాకిస్థాన్కు తాము అన్నివేళలా తోడుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పష్టం చేశారు. తాము ప్రారంభించిన చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపెక్)యే ఇరుదేశాల ఉక్కుబంధానికి నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. సీపెక్ ప్రాజెక్టు ప్రారంభానికి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఇస్లామాబాద్లో జరిగిన వేడుకలకు ఆయన తన వీడియో సందేశాన్ని పంపించారు.
‘‘రూ. 4.9 లక్షల కోట్ల విలువైన సీపెక్ మౌలికవసతుల కార్యక్రమం చాలా కీలకమైనది. 2013లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి మన ఇరు దేశాలు సంయుక్త కృషితో ఉమ్మడి ప్రయోజనాలతో ముందుకు వెళ్తున్నాయి. పాకిస్థాన్ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సైతం సీపెక్ ఒక కొత్త ఊపును తీసుకొచ్చింది. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా సరే..మున్ముందు మా మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపైనే దృష్టిపెడతాం. మా స్నేహాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం’’ అని జిన్పింగ్ పేర్కొన్నారు.
More Stories
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి