రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కేంద్ర ప్రభుత్వం రూ. 780 కోట్ల మేర బిల్లులు ఇచ్చిందని, కానీ పనులు మాత్రం జరగలేదని పురందేశ్వరి చెప్పారు. కనీసం ప్రాజెక్టులు మరమ్మత్తులు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్టు వద్ద ఇసుక అక్రమ రవాణా వల్లే గేటు కొట్టుకుపోయిందని ఆమె ఆరోపించారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వకుండా నీటిని నిల్వ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని, యువతని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. ఇక, వైసీపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని పేర్కొంటూ రాయలసీమ ప్రాంత యువత, రైతులు వలస వెళ్లి.. వేరే ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటున్నారని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఓర్వకల్లులో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ను కేంద్రం పెడుతోందని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించిందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని పురందేశ్వరి ధ్వజమెత్తారు. 14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని ఆమె ఆరోపించారు.
సర్పంచ్లు చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. రాయలసీమలోని గుడ్రేవుల ప్రాజెక్టు, సిద్దేశ్వరం అలుగు చిరకాల కల అలాగే ఉందని ఆమె విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.
More Stories
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
నిప్పుల గండంగా మారిన తెలుగు రాష్ట్రాలు
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్