జమ్మూకశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు ప్రారంభమైన నేపథ్యంలో వారి కోసం కేంద్ర సైనికల బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చేపట్టాయి.  భారత సైన్యం స్పెషల్ ఫోర్సుకు చెందిన సైనికులు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సింధారా, పూంచ్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.
ఉగ్రవాదుల ఏరివేత కోసం కేంద్ర బలగాలు డ్రోన్లను రంగంలోకి దింపాయి. సోమవారం రాత్రి 11.30 గంటలకు ఉగ్రవాదులకు, కేంద్ర బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు.  వారంతా విదేశీ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొనారు. 
 
ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్‌, మ్యాగజైన్‌, 11 రౌండ్ల బుల్లెట్లు, ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున కూడా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. 
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకాశ్మీర్ పోలీసు దళాలని పోలీసులు చెప్పారు. హతమైన ఉగ్రవాదులు విదేశీ ఉగ్రవాదులేనని, వారి వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపిన భారత ఆర్మీ అధికారులు తెలిపారు.