ప్రభుత్వ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా కేజీ టమాటా ధర సగటున రూ. 117గా ఉంది. దానితో సబ్సిడీలో ఇచ్చే టమాటాల ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా హోల్సేల్ మార్కెట్లో టమాటాల సబ్సిడీ రేటును కేజీకి రూ. 90 నుంచి రూ. 80కి తగ్గించింది. దిల్లీ, ఎన్సీఆర్తో పాటు ఎంపిక చేసిన పలు రాష్ట్రాల్లోని నగరాల్లో ఈ రేట్లు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.
“కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హోల్సేల్ టమాటాల ధరలను తగ్గించింది. ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాస్త ఉపశమనం లభించనుంది,” అని ఓ అధికారి వెల్లడించారు. ఢిల్లీతో పాటు నోయిడా, కాన్పూర్, వారణాసి, పట్నా, ముజాఫర్పూర్లోని ఎన్ఏఎఫ్ఈడీ (నేషనల్ లెవల్ ఫార్మర్స్ కో- ఆపరేటివ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్), ఎన్సీసీఎఫ్ (నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్)ల ద్వారా సబ్సిడీ రేట్లకు టమాటాలను విక్రయిస్తోంది కేంద్రం.
“దేశంలోని 500కుపైగా సప్లై పాయింట్లలో పరిస్థితులను పరిశీలించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి సబ్సిడీలో ఇచ్చే కేజీ టమాటా ధర రూ. 80గా ఉండనుంది. దిల్లీ, బిహార్, ఉత్తర్ ప్రదేశ్లలో తమ నిర్ణయం ఆదివారం అమల్లోకి వచ్చింది. మార్కెట్లో ధర పరిస్థితి ఆధారంగా ఇతర నగరాల్లో సోమవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది,” అని కేంద్రం ఓ ప్రకటన విడదుల చేసింది.
More Stories
పనిమనిషి దగ్గర దొరికిన డబ్బుతో ఝార్ఖండ్ మంత్రి అరెస్ట్
స్పామ్ కాల్స్ నియంత్రణకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు