ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితురాలైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.. ఆమెను ఎంపిక చేసిన సమయంలో పురందేశ్వరీ తీర్ధయాత్రలలో ఉన్నారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఆమె ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు ఆమె ధన్యవాదాలు తెలియపారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు
‘‘నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నాకిచ్చిన బాధ్యత విషయంలో నిబద్ధతతో పని చేస్తానని మాటిచ్చాను” అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.
ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఏపీ, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అందరిని కలుపుకుని బిజెపిని ఎపిలో బలోపేతం చేస్తానని తెలిపారు.
More Stories
మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల