ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్ లో పాలగోనే బహిరంగసభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కోరారు. శుక్రవారం ఉదయం భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్న ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు.
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేస్తారని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతూ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నామని ధ్వజమెత్తారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్హౌజ్కు పరిమితం చేయాలని కిషన్ రెడ్డి పిలుపిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారీ బీజేపీని ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరనున్నారని వెల్లడించారు. మంత్రులు, ముఖ్యమంత్రి సచివాలయంకు పోయే పరిపాలన కావాలని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవని పేర్కొంటూ ఇతర పార్టీలు చేసే విషప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కేంద్ర మంత్రి కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గతంలో అనేకసార్లు కలిశాయని చెబుతూ రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కేసీఆర్ మాట్లాడిన విషయం గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. ఆ రెండు పార్టీలు రెండు బొమ్మ బొరుసు పార్టీలని ఆరోపించారు.
గతంలో 18 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే,12 మంది ఎమ్యెల్యేలు బిఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ మాత్రమే కుటుంబపాలనను అంతమొందించగలదని స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే న్యాయమైన పాలన చేయగలదని హామీ ఇచ్చారు. గత 9 ఏండ్లుగా మోదీ ప్రభుత్వం నీతిమంతంగా పనిచేస్తున్నదని చెప్పుకొచ్చారు.
మంచి ప్రభుత్వం తెలంగాణకు అందిస్తామని చెబుతూ చాలా ఏండ్ల తర్వాత భారత ప్రధానిగా మోదీ వరంగల్కు వస్తున్నారని తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోదీదని కొనియాడారు. వరంగల్ జిల్లాకు టెక్స్టైల్ పార్క్ కేంద్రమే మంజూరు చేసిందని తెలిపారు.
వరంగల్ అభివృద్ధి విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నదని చెబుతూ రైలు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో భవిష్యత్లో రైలు ఇంజన్ సహా వ్యాగన్లు, కోచ్లు ఏమైనా తయారు చేసుకోవచ్చని కిషన్ రెడ్డి వెల్లడించారు. అనుకున్నదానికంటే పెద్ద పరిశ్రమనే కాజిపేటకు వచ్చిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ ఎయిర్పోర్టు అంశం మొదటిదని అంటూ కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.
కేసిఆర్ ది కమీషన్ల ప్రభుత్వం అంటూ కుటుంబ వాటాలు, పెత్తనం లేని పరిపాలన తెలంగాణలో తీసుకువస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
మామునూర్ ఎయిర్ పోర్ట్ స్థలం విషయంలో తాను, తమ అధికారులు రాష్ట్రానికి ఎన్నోసార్లు లేఖలు వ్రాసినా తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన లేదని విమర్శించారు.
మామునూర్ ఎయిర్ పోర్ట్ స్థలం విషయంలో తాను, తమ అధికారులు రాష్ట్రానికి ఎన్నోసార్లు లేఖలు వ్రాసినా తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన లేదని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. విమానయాన ప్రయాణాన్ని బీజేపీ ప్రోత్సాహిస్తుందని తెలిపారు. వరంగల్ కు తమ ప్రభుత్వం ఎంతో చెసిందని చెబుతూ స్మార్ట్ సిటీ, అమృత్ వంటి స్కీమ్స్ ఇచ్చామని, పీఎం మిత్ర ద్వారా మెగా టెక్స్ టైల్ పార్క్ కు కేంద్రం నిధులు సమకూర్చామని, రూ. 550 కోట్లతో జాతీయ రహదారి అనుసంధానం జరిపామని వివరించారు.
More Stories
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి