భారత్ లో పలు ఐఐటీలను నెలకొల్పిన ప్రభుత్వం తాజాగా విదేశాల్లో తొలి క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. టాంజానియాలోని జంజిబార్ లో ఐఐటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాతో ఒప్పందం కుదిరిందని వెల్లడించింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటీ మద్రాసుకు చెందిన మరో క్యాంపస్ ను జాంజిబార్ లో ఏర్పాటు చేస్తారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్, జాంజిబార్ ప్రెసిడెంట్ హుస్సేన్ అలీ విన్యీల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం జైశంకర్ టాంజానియా పర్యటనలో ఉన్నారు.
భారత్, టాంజానియాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను జాంజిబార్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న లక్ష్యాల మేరకు టాంజానియాలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నారు.
లోని ప్రముఖ యూనివర్సిటీల క్యాంపస్ లను విదేశాల్లో ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించాలని నూతన జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా పేర్కొన్నారు. టాంజానియా ఐఐటీలో అకడమిక్ ప్రొగ్రామ్స్ 2023 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి.
More Stories
కల్నల్ వైభవ్ కాలే మృతికి క్షమాపణలు చెప్పిన ఐరాస
గాజాపై ఇజ్రాయెల్ దాడిలో భారతీయుడు మృతి
రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తొలగింపు