మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం పక్కా

మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం పక్కా

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం పక్కా అని ‘టైమ్స్ నౌ- నవభారత్’ సర్వే  వెల్లడించింది. ‘జన్‌ గన్‌ కామన్’ పేరుతో ‘టైమ్స్ నౌ- నవభారత్’ ఈ సర్వేను నిర్వహించింది.  బీజేపీ కూటమికి 543 సీట్లకు గాను 285- 325 వరకు సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని టైమ్స్ నౌ- నవభారత్ వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 111-149 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది.

 అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తోందని చెప్పారు. ఏపీలో 25 స్థానాలు ఉంటే వైసీపీకి 24- 25 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. తెలుగు దేశం పార్టీకి 0 – 1 మధ్య సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించే అవకాశం ఉందని తెలిపింది.

ఇక, తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి 37 శాతం ఓట్లతో 9- 11 మధ్య ఎంపీ స్థానాలు సాధిస్తుందని టైమ్స్ నౌ- నవభారత్ వెల్లడించింది. అలాగే తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీకి 29.2 శాతం ఓట్లు, బీజేపీకి 25.3 శాతం ఓట్లు వస్తాయని తేలిపింది.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 20-22 స్థానాలు, ఒడిశాలోని బీజేడీ పార్టీ 12-14 ఎంపీ సీట్లు గెలుస్తుందని సర్వేలో అంచనా వేసింది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 50.30 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 4 నుంచి 7 స్థానాలు, సమాజ్ వాదీ పార్టీకి 4 నుంచి 8 సీట్లు, ఇతరులకు 18 నుంచి 38 సీట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది.