హిందూ ప్రామాణిక గ్రంథాలైన వేదాల్లో, ఉపనిషత్తుల్లో లేని కులం పేరిట ఇప్పుడు మనుషులు విడిపోవడం, విభేదాలు చోటు చేసుకోవడం ధర్మ విరుద్ధమని అవధాన సరస్వతి పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు స్పష్టం చేశారు. కులం గడప లోపల ఉండాలని గడప దాటిన తర్వాత అందరం హిందువులం, భారతీయులమేనని ఆయన హితవు చెప్పారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని కలువ రాయికి చెందిన కావ్య కంఠవిశిష్ట గణపతి రమణ మహర్షి ఆశ్రమంలో కఠోర తపస్సు చేసి స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్రం రావాలని, పంచమ జాతి పేరిట కుల వివక్ష ఆగిపోవాలని గుర్తు చేశారు. సంఘసంస్కర్తగా గురజాడ అప్పారావు, వితంతు వివాహం ప్రోత్సహించిన బంకుమల్లి మల్లయ్య శాస్త్రి, తాగునీటిపై అందరికీ సమాన హక్కులు ఉన్నాయని సర్దార్ గౌతు లచ్చన్న, కుల వివక్ష లేని సమాజం కోసం చట్టం తేవాలని తెన్నేటి విశ్వనాథం ఈ ప్రాంతం నుంచే ఉద్యమించారని వివరించారు.
వీరందరి ఆకాంక్షలకు తగ్గట్టుగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల వివక్ష లేని రాజ్యాంగాన్ని మన ముందు ఉంచారని ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని గరికపాటి పిలుపునిచ్చారు ఇచ్చారు.మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా తన తండ్రి సర్దార్ గౌతు లచ్చన్న ప్రాణాలకు తెగించి కృషి చేశారని చెప్పారు. దళితులకు మిగిలిన వారికి సమానంగా బావిలో నీరు తోడుకునే అవకాశం కల్పిస్తే భౌతికంగా దాడులు చేస్తామని చెప్పినా లెక్కచేయకుండా సామాజిక సమరసత కు ఆయన కృషి చేశారని గుర్తు చేశారు.
గ్రామాల్లో అందరికీ దేవాలయ ప్రవేశం, స్మశానాల్లో వివక్ష లేకుండడం, నీటి దగ్గర సమానత్వం ఉన్నప్పుడే కుల వ్యవస్థ నుంచి దూరమైనట్టని ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత ప్రచారక్ జనార్ధన్ చెప్పారు. పలు సంఘటనలో అగ్రవర్ణాలుగా చెప్పుకునే వారు దూరంగా పెట్టిన నిమ్న జాతిల వారిని దేవుల్లే ఆశీర్వదించారని గుర్తు చేశారు. కులం అంటరానితనం పేరిట జరిగే వివక్షను దుష్ట సంప్రదాయాన్ని పారద్రోలి సమరసతను సాధించాల్సిన బాధ్యత హిందువుల అందరి మీద ఉందని గుర్తు చేశారు.
ఆంధ్ర విద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య జి నాగేశ్వరావు మాట్లాడుతూ దేశ చరిత్రను పాఠ్య పుస్తకాలనుంచి తీసివేయటం వల్లే సమాజంలో వివక్ష ఎక్కువైందని పేర్కొన్నారు. చెట్టు పుట్ట రాయి రప్పని పూజించే హైందవ ధర్మం మనుషులను సమానంగానే చూస్తుందని స్పష్టం చేశారు. హిందూ అనేది మతం కాదని జీవన విధానం అని అది ప్రపంచ శాంతిని కోరుతుందని చెప్పారు.
మాజీ ఉప కులపతి లజపతిరాయ్ మాట్లాడుతూ సామాజిక సమరసత నేటి అవసరమని, అందరూ అందుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు సమాన అవకాశాలు, కుల వివక్ష అంతమైతే మనుషుల మధ్య విభేదాలు ఉండమని ప్రిన్సిపాల్ పాక సుందరి రాణి స్పష్టం చేశారు. సమాజం నుంచి కులం అనే క్యాన్సర్ తీసేయాలని వేదిక రాష్ట్ర కన్వీనర్ దూలం బూసిరాజు పిలుపునిచ్చారు.
More Stories
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల