అంతకు ముందు భారత్లో మైనారిటీలపై వివక్ష లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్లు సంయుక్తంగా మీడియా సమావేశంలో భారత్లో మైనారిటీలపై వివక్ష కొనసాగుతోందని, ప్రశ్నించినవారి గొంతుకలను అణిచివేసేందుకు యత్నిస్తుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్లో మైనారిటీలపై వివక్ష లేనేలేదని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
మైనారిటీలపై వివక్ష వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ భారత్, అమెరికాల డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలను ఉటంకించారు. ”ప్రజాస్వామ్యం మన ఆత్మలో ఉంది. ప్రజాస్వామ్యం మన రక్తంలోనే ఉందని, మనం ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాం” అని తెలిపారు.
మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ఈ భావనను మన రాజ్యాంగంలో పొందుపరిచామని, భారతదేశం ప్రజాస్వామ్యయుతంగానే నడుస్తోందని తేల్చి చెప్పారు. మావన విలువలు, మానవ హక్కులను కాపాడకపోతే ప్రజాస్వామ్యమే లేదని స్పష్టం చేశారు. కులం, మతం, లింగ భేదం లేకుండా దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం అందించగలమని తాము ఎప్పుడో నిరూపించామని చెబుతూ భారత్లో వివక్షకు తావేలేదని ప్రధాని పేర్కొన్నారు.
”అందుకే సబ్ కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదంతో ముందుకు సాగుతున్నాం, ఇవే మా దేశం విశ్వసించే ఆధార సూత్రం. కులం, మతం, వయస్సు, బౌగోళిక తేడాలు లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది” అని తెలిపారు. ఈజిప్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నేడు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈజిప్టులో 11వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రక అల్ హకీమ్ మసీదును ప్రధాని సందర్శించనున్నారు. ఇక్కడ ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 4,000 మందికి పైగా సైనికులకు నివాళులర్పిస్తారు.
More Stories
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్కు ఓటమి ఖాయం
ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ టీకా ఉపసంహరణ
రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి పుతిన్ బాధ్యతలు స్వీకారం