పౌర విమానయాన రంగం అద్భుతమైన వృద్ధి

దేశంలోని పౌర విమానయాన రంగం అద్భుతమైన వృద్ధిని సాధించింది. దేశీయంగా విమానయాన సంస్థల్లో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశీయ విమానయాన సంస్థలు అందించిన ట్రాఫిక్ డేటా ఆధారంగా జనవరి-మే 2023లో ప్రయాణీకుల సంఖ్య 636.07 లక్షల మైలురాయిని చేరుకుంది.
 
ఇది జనవరి-మే 2022 సంవత్సరంతో పోల్చితే 36.10% గణనీయమైన వార్షిక వృద్ధి రేటును ప్రతిబింబిస్తుంది. ఆ సమయంలో ప్రయాణీకుల సంఖ్య 467.37 లక్షలు. 2022,మే నెలలో ప్రయాణీకుల సంఖ్య 114.67 లక్షలు కాగా అది 2023 మేలో 132.41 లక్షలకు పెరిగింది. నెలవారీ వృద్ధిని 15.24% నమోదు చేసింది.
 
సురక్షితమైన, సమర్థవంతమైన, కస్టమర్-కేంద్రీకృత విమానయాన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క సమిష్టి కృషికి ఈ స్థిరమైన వృద్ధి నిదర్శనం. ఏప్రిల్ 23తో పోలిస్తే మే 2023లో మొత్తం ప్రయాణీకుల సంఖ్య 3.26 లక్షలు (2.52%) పెరిగింది.

ప్రయాణీకుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల భారతదేశ  విమానయాన రంగ  బలం, మన్నికను ప్రదర్శిస్తుంది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి, మన దేశ పౌరులకు సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలను అందించడానికి నిరంతర కృషి జరుగుతోంది. 
జనవరి-మే 2023 మధ్యకాలంలో 636.07 లక్షల మంది ప్రయాణీకుల అధిక లోడ్ ఫ్యాక్టర్ విమాన రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తుంది, ఇది విమానయాన పరిశ్రమ యొక్క అనుకూలమైన దిశను చాటిచెబుతోంది.
అలాగే మే 2019 కంటే మే 2023లో ఫిర్యాదుల సంఖ్య తగ్గింది.  మే 2019లో షెడ్యూల్ చేయబడిన దేశీయ విమానయాన సంస్థలకు మొత్తం 746 ప్రయాణీకులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. అయితే, మే 2023లో షెడ్యూల్ చేయబడిన దేశీయ విమానయాన సంస్థలకు మొత్తం 556 ప్రయాణీకులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.

కేంద్ర పౌర విమానయాన  మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియా ప్రకారం “విమానయాన రంగం వృద్ధిని ప్రోత్సహించడంలో మరియు భారతదేశాన్ని ప్రముఖ ప్రపంచ విమానయాన కేంద్రంగా స్థాపించడంలో వాటాదారులందరి సహకార ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయి”. దేశీయ విమానయాన పరిశ్రమ స్థిరమైన విస్తరణ, ప్రాంతీయ విమానయాన సంస్థల పుట్టుక మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని ఆయన చెప్పారు. “దేశం అంతటా ప్రజలను కలుపుతున్నాయి. ఉడాన్‌ పథకం ద్వారా చివరి మైలు కనెక్టివిటీకి భరోసా ఇస్తున్నాయి” అని తెలిపారు.