
ప్రపంచ అత్యుత్తమ టాప్ 10 పాఠశాలల జాబితాలో మన దేశానికి చెందిన ఐదు పాఠశాలలు స్థానం సంపాదించుకుని తమ సత్తా చాటుకున్నాయి. బ్రిటన్కు చెందిన వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజెస్ ఈ ద్వివార్షిక పోటీని నిర్వహించింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన ఈ ఐదు పాఠశాలలు వివిధ కేటగిరీల కింద స్ఫూర్తిదాయకమైనవిగా పరిగణించారు.
ఢిల్లీకి చెందిన నగర్ నిగం ప్రతిభా బాలిక విద్యాలయ, ముంబైకి చెందిన ఒబెరాయ్ ఇంటర్నేషనల్ స్కూల్, షిండేవాడి ముంబై పబ్లిక్ స్కూల్, గుజరాత్ లోని అహ్మదాబాద్కు చెందిన రివెర్సైడ్ స్కూల్, మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్కు చెందిన స్నేహాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎంపికయ్యాయి.
సామాజిక సహకారంలోను, , పర్యావరణ కార్యాచరణ, నూతన ఆవిష్కరణ, ప్రతికూతలను అధిగమించడం, ఆరోగ్యకర జీవిత సహకారం తదితర ఐదు కేటగిరీల కింద ఈ పాఠశాలలను ఎంపిక చేశారు.ఈ కేటగిరీలకు సంబంధించిన 2,50,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు )నగదు బహుమతిని ఈ పాఠశాలలకు సమానంగా పంచుతారు.
ఈ పాఠశాలలు రాబోయే తరం స్ఫూర్తి చెందేలా కీలక పాత్ర వహించాయని, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో సమాజ పురోగతికి ఎంతో పాటు పడ్డాయని నిర్వాహకులు పేర్కొన్నారు. బ్రిటన్లో గత ఏడాది ఈ పోటీలను ప్రారంభించారు.
యాక్సెంచర్, అమెరికన్ ఎక్స్ప్రెస్, యయాసన్ హసనా, లెమాన్ ఫౌండేషన్ల భాగస్వామ్యంతో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోన్న డిజిటల్ మీడియా ప్లాట్ఫారమ్ టి 4ఎడ్యుకేషన్ ద్వారా వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజ్లు 2022 లో నెలకోల్పారు. ఈ అవార్డుల వ్యవస్థాపకుడు వికాస్ పోటా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పాఠశాలలు అనుసరిస్తున్న వినూత్న పంథా చరిత్ర ప్రపంచం లోని పాఠశాలలు తెలుసుకుని స్ఫూర్తి పొందుతాయని తెలిపారు.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం