హైదరాబాద్ లో వ్యవసాయ పరిశోధన సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా తర్వాత తలెత్తిన సమస్యలపై చర్చించడానికి జీ-20 సమావేశాలు వేదికగా మారాయి. 46 రంగాలపై 250 సమావేశాలు జరుగుతున్నాయి.
ఇప్పటికీ 140 సమావేశాలు పూర్తయ్యాయి. రాజధాని కేంద్రంగా కీలకమైన రంగాలపై సమావేశాలు జరుగనున్నాయి. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్లో స్టార్టప్ ను ప్రోత్సహించడానికి సమావేశాలు జరిగాయి. రెండో సమావేశం ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ అంశాలపై చర్చించారు. జూన్ 4,5,6 తేదీల్లో జీ-20 హెల్త్ వర్కింగ్ 5 సమావేశం జరిగింది.
పర్యాటక రంగానికి సంబంధించి చివరి సమావేశాలు ఈ నెల 21,22,23 తేదీల్లో గోవాలో నిర్వహించనున్నరని తెలిపారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రగతి మైదాన్ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన తుది సమావేశాలు జరుగుతాయని తెలిపారు.
More Stories
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్