ప్రపంచ పర్యావరణ ప్రదర్శనలో భాగంగా ‘వ్యర్థ పదార్థాల నిర్వహణ’ అంశంపై జరిగిన ఈ సదస్సులో కేంద్ర మంత్రి మురళీధరన్తో పాటు జైన మతాచార్యులు డా. లోకేశ్ ముని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (కోర్వా) సభ్యులు రాజన్ ఛిబ్బర్ (అనుసంధాన సలహాదారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) కల్నల్ తేజేంద్ర పాల్ త్యాగి (ఛీఫ్ కన్వీనర్, కోర్వా), ఆర్.ఎస్.వి బద్రీనాథ్ (రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్, హైదరాబాదు), స్వదేశ్ కుమార్ (అధ్యక్షులు, గ్రీన్ సొసైటి ఆఫ్ ఇండియా), కరుణ సింగ్ (రీజనల్ డైరెక్టర్, దక్షిణ, ఆగ్నేయాసియా – ఎర్త్ డే నెట్వర్క్), రాయనపూడి భాగ్యలక్ష్మి (మేయర్, విజయవాడ), కె. వి. సత్యవతి (అడిషనల్ కమిషనర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్)తో పాటు దేశంలోని పలు నగరాల మేయర్లు, సంబంధిత రంగానికి చెందిన పలువురు పాల్గొన్నారు.
ఆచార్య లోకేష్ ముని మాట్లాడుతూ వినియోగ సంస్కృతి, పౌర బాధ్యతలపై అవగాహన లేమి కారణంగా లోకంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగోళం వ్యర్థాలతో నిండిపోతోందని అన్నారు. అందరూ చెట్లను నాటడం, సంరక్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ రక్షణలో పాల్పంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కల్నల్ తేజేంద్ర పాల్ త్యాగి మాట్లాడుతూ ‘రెడ్యూస్ – రీయూస్ – రీసైకిల్’ నినాదాన్ని అందరూ పాటించాలని కోరారు. వ్యర్థ సంబంధిత సమస్యలపై ప్రతిఒక్కరూ గళం విప్పాలని, లేఖలు, అర్జీల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సత్వరమే ఏ సమస్యా పరిష్కారం కాదని, నిరంతర కృషి కొనసాగించాలని పేర్కొన్నారు. సదస్సులో భాగంగా గ్రీన్ ఇండియా అవార్డులను ప్రదానం చేశారు. ఆర్.ఎస్.వి బద్రీనాథ్, మద్దుకూరి వెంకట సుబ్బారావు తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు.
More Stories
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు