యాదగిరిగుట్ట వద్ద ట్రాఫిక్ చలాన్లపై నిరసన

దేవాలయాల దగ్గర ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలతో పాటు గుట్టకు వెళ్లే రహదారిలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కాలుష్యం, పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిందేనని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు.
 
దీంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. “నిరంతరం మేము రోడ్డుపైనే సంచరిస్తుంటాము. మరో సందర్భంలో కడతాము” అని చెబుతున్నా భక్తులను పోలీసులు కదలనివ్వడం లేదు. దీంతో దేవాలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడి పోవాల్సిన పరిస్థితిని తీసుకువస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
 
ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రాచకొండ కమిషనర్ పరిధిలో గల దేవాలయాల అన్నింటి దగ్గర ట్రాఫిక్ పోలీసుల వేధింపులు మానుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ ను పరిషత్ నేతలు కోరారు. రోడ్డుకు ఇరు పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా వాహనాలు నిలిపినా కూడా ఉద్దేశపూర్వకంగా ఫోటోలు తీస్తూ చలాన్ విధిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ట్రాఫిక్ చలాన్ ల పేరుతో భక్తులను వేధిస్తే తగిన రీతిలో జవాబు ఇస్తామని వారు హెచ్చరించారు.  హిందూవేతరులు ఫుట్ పాతులతో మొదలుకొని ప్రధాన రోడ్డులను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ట్రాఫిక్ ఇబ్బందులను గురిచేస్తున్న వారిని వెంబడి రోడ్లపై తొలగించాలని డిమాండ్ చేశారు.
 
కమిషనర్ ను కలిసిన వారిలో పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  పండరీనాథ్, సహకార్యదర్శి భాను ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు  జగదీశ్వర్ గారు, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్   శివ రాములు తదితరులు ఉన్నారు.