అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను పంపిన చైనా

జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్‌తో షెంజౌ-16 సిబ్బంది బయలుదేరారు. చైనా మంగళవారం తన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చంద్రునిపైకి సిబ్బందితో కూడిన మిషన్‌ను పంపే ప్రణాళికలను అనుసరిస్తున్నందున మొదటిసారిగా ఒక పౌరుడిని కక్షలోకి ప్రవేశపెట్టింది.

నాసా అంత‌రిక్ష కేంద్రం త‌ర‌హాలో .. చైనా కూడా స్పేస్ స్టేష‌న్నిర్మించింది. ఇప్పుడు ఆ అంత‌రిక్ష కేంద్రానికి డ్రాగ‌న్ దేశం టైకోనాట్స్‌ను తీసుకువెళ్లింది. ముగ్గురు వ్యోమ‌గాములు ఇవాళ నింగిలోకి ఎగిరారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి సైనం నడిపిస్తున్న అంతరిక్ష కార్యక్రమంతో పోటీపడుతోంది.

 అమెరికా, రష్యాతో సమానంగా పోటీ పడాలనుకుంటోంది. వాయువ్య చైనాలోని జియక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఉదయం 9.31 గంటలకు లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్‌తో షెన్‌జౌ-16 సిబ్బంది బయలుదేరారు. చైనా స్పేస్ స్టేష‌న్ పూర్తిగా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత టైకోనాట్స్ వెళ్ల‌డం ఇదే తొలిసారి.

దీనిని ఎఎఫ్‌పి జర్నలిస్టులూ చూశారు. ‘ప్రయోగం పూర్తిగా విజయవంతం అయింది. వ్యోమగాములు మంచి స్థితిలో ఉన్నారు’ అని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ డైరెక్టర్ జూ లిపెంగ్ తెలిపారు. రాకెట్ నింగిలోకి పోతున్నప్పుడు ప్రేక్షకులు ‘వావ్’ అని బిగ్గరగా కేకలు పెట్టారు. ‘గుడ్ లక్’ అని కూడా విష్ చేశారు.

 చైనా ‘అంతరిక్ష స్వప్నం’ అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ది. చంద్రుడిపై స్థావరం నిర్మాణ ప్రణాళిక కూడా చైనాకు ఉంది. 2011 నుంచి చైనాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వేరుగా ఉంచారు. ‘నాసా’లో చైనాను నిమగ్నం కానివ్వకుండా అమెరికా నిషేధించింది. దాంతో చైనా స్వంతగా ఆర్బిటల్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేసుకోడానికి నెట్టివేయబడింది.

 కాగా చైనా అంతర్జాతీయ సహకారాన్ని ఆశిస్తున్నట్లు సోమవారం పునరుద్ఘాటించింది. ప్రతి సంవత్సరం ఇద్దరు సిబ్బందితో అంతరిక్ష యాత్రలను చేపట్టాలని చైనా యోచిస్తోందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ(సిఎంఎస్‌ఎ) తెలిపింది. చైనా తదుపరి షెన్‌జౌ17ను అక్టోబర్‌లో ప్రయోగించనున్నది.

మిష‌న్ క‌మాండ‌ర్ జింగ్ హైపెంగ్‌, స్పేస్‌లిఫ్ట్ ఇంజినీర్ జూ యాంగ్జూ, పేలోడ్ నిపుణుడు గుయి హైచావోలు ఇవాళ షెంజూ-16లో స్పేస్ స్టేష‌న్‌కు వెళ్లారు. జింగ్ అంత‌రిక్షంలోకి వెళ్ల‌డం ఇది నాలుగోసారి. షెంజూ-1, షెంజూ-9, షెంజూ-11 మిష‌న్ల‌లో కూడా ఆయ‌న పాల్గొన్నారు. చివ‌రి రెండు మిష‌న్ల‌కు క‌మాండ‌ర్‌గా చేశారు. ఇక టైకోనాట్ జూ ఓ వ‌ర్సిటీ టీచ‌ర్‌. ఆయ‌న‌కు డాక్ట‌రేట్ డిగ్రీ ఉంది. చైనా స్పేస్ స్టేష‌న్‌లోకి వెళ్తున్న తొలి ఫ్ల‌యిట్ ఇంజినీర్. బిహంగ్ యూనివ‌ర్సిటీలో ఆస్ట్రోనాట్ గుయి ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు.