ఈ రాజదండం ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నం. తిరువవడుతురై ఆధీనానికి చెందిన అంబలవన దేసిగ పరమాచార్య స్వామిగళ్ శుక్రవారం మాట్లాడుతూ, సెంగోల్కు సముచిత ప్రాధాన్యం ఇస్తుండటం తమిళనాడుకు గర్వకారణమని చెప్పారు. 1947లో లార్డ్ మౌంట్బాటన్ ఈ సెంగోల్ను జవహర్లాల్ నెహ్రూకు అందజేశారని పేర్కొన్నారు. దీనిని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని మోదీ నిర్ణయించడం హర్షణీయమని, గర్వకారణమని తెలిపారు.
చారిత్రక రాజదండానికి దీనిని ముందుగా స్వీకరించిన వారు సముచిత గౌరవం ఇచ్చి ఉన్నట్లు అయితే బాగుండేదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. . దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దీనిని అలహాబాద్లోని నెహ్రూజీ కుటుంబానికి చెందిన ఆనంద్భవన్లో ఓ కర్ర తరహాలో ప్రదర్శనకు ఉంచారని తనకు తెలిసిందని, దీనిని గుర్తించి తమ ప్రభుత్వం దీనిని అక్కడి నుంచి తీసుకువచ్చిందని ప్రధాని చెప్పారు.
తమిళనాడుకు చెందిన దాదాపు 60 మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఓ క్రతువు మాదిరిగా ఈ దండాన్ని ప్రధాని అధికారిక నివాసానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
అప్పటి మద్రాసులో సుప్రసిద్ధ నగల వ్యాపారి అయిన వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్ను రూపొందించారు. అద్భుతమైన రాజదండం సుమారు ఐదు అడుగుల పొడవు, పైభాగంలో ఒక ఎద్దు చెక్కబడి ఉంటుంది. తమిళనాడులోని మఠాలు లేదా అధీనంలకు ప్రత్యేకత ఉంది. ఇవి అగ్రవర్ణాల ఆధిక్యతను ప్రతిఘటించాయని, మతాన్ని సామాన్య జనం వద్దకు , అంటరాని వారి వద్దకు తీసుకువెళ్లే క్రమంలో ముందుకు సాగాయని చరిత్ర ఉంది. ఇక్కడికి వచ్చిన వారిలో అత్యధికులు శతాధికులే.
More Stories
తెలుగు భాషను బతికించుకోవాలి
కాంగ్రెస్ పార్టీకి రూ.1823 కోట్ల ఐటీ నోటీసు
డబ్బులేకే పోటీ చేయడం లేదు .. నిర్మలా