ప్రముఖ దర్శకుడు కె వాసు మృతి

తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిని మరిచిపోకముందే మరొకరు వరుసగా సినీ ప్రముఖులు భౌతికంగా దూరం అవుతూ కోలుకోలేని విషాదాన్ని నింపుతున్నారు. నాలుగు రోజుల కింద లెజెండరీ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూసిన బాధ నుంచి తీరిపోకముందే మరో సీనియర్ నటుడు శరత్ బాబు మరణ వార్త అందరినీ కలిచి వేసింది.
 
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే వాసు శుక్రవారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  హైదరాబాద్  ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు దర్శకుడు ఈయనే. దర్శకుడిగా 1974లో కెరీర్ ప్రారంభించిన కె. వాసు మొదటి చిత్రం ‘ఆడపిల్లల తండ్రి’. ఆ తర్వాత ఆయన చేసిన ‘ప్రాణం ఖరీదు’
 
దర్శకుడిగా 1974లో కెరీర్ ప్రారంభించిన కె. వాసు మొదటి చిత్రం ‘ఆడపిల్లల తండ్రి’. ఆ తర్వాత ఆయన చేసిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి నటుడిగా అరంగేట్రం చేశారు. కె. వాసుది ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని ముదునూరు.  ప్రాణం ఖరీదు, కోతల రాయుడు, తోడు దొంగలు, అల్లుళ్లొస్తున్నారు, పల్లెటూరి పెళ్లాం  వంటి  చిత్రాలకు కే వాసు దర్శకత్వం వహించారు. కే.వాసు తండ్రి ప్రత్యగాత్మ ఆయన సోదరుడు హేమాంబరధరరావు ఇద్దరూ కూడా దర్శకులే. టాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాలను వీరు రూపొందించారు.
 
తండ్రి, బాబాయ్ బాటలో నడిచిన వాసు కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రాణం ఖరీదు సినిమా  కే.వాసుకు మంచి పేరు తీసుకొచ్చింది.  విజయ చందర్ శిరిడి సాయిబాబా పాత్రలో తెరకెక్కించిన ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, వాసు  కెరీర్‌లో మలుపు అని చెప్పొచ్చు. ఆ తర్వాత చిరంజీవితో అల్లుళ్లు వస్తున్నారు, సుమన్ తో అమెరికా అల్లుడు లాంటి సినిమాలను కే వాసు తెరకెక్కించారు. వీటితో పాటు  గోపాల్ రావు గారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి,గువ్వల జంట, కలహాల కాపురం, దేవుడు మావయ్య, డామిట్ కథ అడ్డం తిరిగింది, బాబులు గాడి దెబ్బ, పుట్టినిల్లా మెట్టినిల్లా, రేపటి రౌడి, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం,  సుమన్‌తో అమెరికా అల్లుడు, చిన్న కోడలు, బ్రహ్మానందం తొలిసారి హీరోగా నటించిన ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ వంటి చిత్రాలకు కే వాసు దర్శకత్వం వహించారు.
శ్రీకాంత్, ప్రభుదేవాలతో పక్కింటి అమ్మాయి  చిత్రాన్ని  ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ గా రీమేక్ చేసి సూపర్హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘గజిబిజి’తో సినిమాలను డైరెక్ట్ చేశారు. చివరగా ఈయన పోసాని కృష్ణ మురళితో ‘తింగరోడు’ సినిమాను తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన ఎక్కువగా సినిమాలు చేశారు.