
భజరంగ్దళ్ను సైతం నిషేధించాలనే చర్చ జరిగిందని చెబుతూమతపరమైన, రాజకీయంగా, సామాజికంగా ఏదైనా సంస్థ సమాజంలో విద్వేషాలను వ్యాప్తి చేయడానికి, సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తే దాన్ని సహించేది లేదని తెలిపారు. అలాంటి సంస్థలతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని చెప్పారు. అది భజరంగ్దళ్ అయినా, పీఎఫ్ఐ అయినా, మరే సంస్థ అయినా కఠినంగా ఉంటామని, శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తే నిషేధించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
‘కర్నాటకను స్వర్గంగా మలుస్తామని మేమ మా మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము. ఒకవేళ శాంతికి విఘాతం కలిగితే, మేము బజరంగ్ దళా లేక మరో సంఘ్పరివార్ సంస్థనా అని చూడం’ అని చెప్పారు. `చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా సరే, అది ఆర్ఎస్ఎస్ కావొచ్చు, మరోకటి కావొచ్చు.. తాము చట్టపరంగా చర్య తీసుకుంటాము’ అని వివరించారు.
గత బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన గోవధ నిషేధం, మత మార్పిడి నిరోధక చట్టాలతో సహా హిజాబ్, పాఠ్యపుస్తకాల సవరణ తదితర వాటిని మేం సమీక్షిస్తాం.. ఈ చట్టాలలో ఏదైనా వివాదాస్పదంగా, మతపరమైన లేదా సామాజిక ఆకృతికి లేదా రాష్ట్ర ప్రతిష్టకు విరుద్ధంగా ఉన్నట్లు మేము గుర్తిస్తే వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’ అని ప్రియాంక్ ఖర్గ్ తెలిపారు.
గతేడాది బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఒకే డ్రెస్ కోడ్ను పాఠశాలలు, కళాశాలల్లో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
More Stories
మరోసారి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం.. అందుకే సీబీఐ విచారణ
క్రికెట్ బుకీని పట్టించిన అమృతా ఫడ్నవీస్