ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న ప్రారంభించిన సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ రైలు మే 17 నుండి రెట్టింపు కోచ్ లతో సేవలను అందించబోతుంది. దీనివల్ల, రెండు దిశలలో ప్రయాణ సమయం కూడా 15 నిమిషాలు తగ్గుతోంది. రైలు నం. 20701/02 సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభంలో 8 కోచ్ల కూర్పుతో ప్రవేశపెట్టారు. ఇందులో 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 7 చైర్ కార్లు ఉన్నాయి.
సాధారణ సేవలను ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు స్థిరంగా 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో ప్రయాణికుల ప్రోత్సాహంతో నడుస్తోంది. రైలు నంబర్ 20701 సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏప్రిల్లో 131శాతం, మే 2023లో 135శాతం; రైలు నంబర్ 20702 తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏప్రిల్లో 136 శాతం, మే 2023లో.138 శాతంమేర ప్రయాణికుల నుండి విశేషమైన స్పందనను నమోదు చేసింది.
ప్రయాణీకుల సంఖ్య పరంగా, మే 15 వరకు, మొత్తం 44,992 మంది ప్రయాణికులు రెండు దిశలలో వందే భారత్ రైలు సేవలను పొందారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 21,798 మంది ప్రయాణికులు రాగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్కు మరో 23,194 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
దానితో రైలు మే 18 నుండి ప్రస్తుత 8 కోచ్ కెపాసిటీకి బదులుగా 16 కోచ్ ల సామర్థ్యంతో నడుపుతున్నారు. 1024 కెపాసిటీతో 14 చైర్ కార్లు ఉంటాయి. 2 ఎగ్జిక్యూటివ్ 104 కెపాసిటీతో ఉంటాయి.
అంతేకాకుండా, సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా రెండు దిశలలో ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలు తగ్గుతుంది. రెండు దిశలలో అంతకుముందు 8.30 గంటల వ్యవధిలో కాకుండా ఇప్పుడు 8.15 గంటలలో చేరుతుంది. తగ్గిన ప్రయాణ సమయానికి అనుగుణంగా, స్టేషన్లలో రైలు సమయాలు కూడా సవరిస్తున్నాడు.
More Stories
మంత్రికి వత్తాసు పలికారని కడప పోలీసులకు చార్జ్ మెమోలు
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన మీనా
ఏపీలో పెట్రోల్ బంక్లపై ఆంక్షలు