కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు రాష్ట్ర హోదాను తొలగించడంతో ఇక్కడ ఉగ్రవాదాన్ని అంతం చేశాయని మాజీ కేంద్ర మంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేసింది ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం కాదు. కానీ ఒక విషయంలో మాత్రం మంచే జరిగింది. ఉగ్రవాదం, సమ్మెలు, రాళ్ల దాడులు అంతం అయ్యాయి’ అని తెలిపారు.
అయితే, రెండేళ్లుగా రాజౌరి, పూంచ్లో జరిగిన మూడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన చెబుతూ ఇలా జరగకూడదని చెప్పారు. ‘ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ 1947 నుంచి రాజౌరి, పూంచ్లో ఉన్నాయి. వారు ఉన్నప్పటికీ, ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఆందోళనకు కారణమని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన పని చేస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదం పెరుగుతున్నందున రాష్ట్ర పోలీసులు, ఇంటెలిజెన్స్, సైన్యం, పారామిలటరీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉగ్రవాదం ఎవరికీ ప్రయోజనం కలిగించదని అజాద్ స్పష్టం చేశారు.
2019 ఆగస్టు 5 న భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, పరిమిత స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీర్ను శాసనసభ కలిగి ఉండే కేంద్ర పాలిత ప్రాంతం గాను (ఢిల్లీ లాగా), లడఖ్ను సభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది