భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఎల్ఓఎస్ కమాండర్ రాజేశ్ కాగా మరొకరు సీఎన్ఎం కమాండర్ నందా ఉన్నట్లు తెలుస్తోంది.
చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఈ భీకర ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టు మృతి చెందిన సంఘటనా స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.
ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా.. పోలీసులెవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తూ ఉంటారు. దీంతో వారిని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ బలగాలు ఎప్పుడూ కూంబింగ్ నిర్వహిస్తూ ఉంటారు.

More Stories
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్
సర్దార్ పటేల్ దూరదృష్టి వల్లే నేటి అఖండ భారతం
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..14 రోజుల రిమాండ్