బీజేపీ మాజీ ఎల్యేల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుకు బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రాథమిక సభ్యత్వం నుంచి ఎందుకు తప్పించకూడదంటూ షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇవాళ సాయంత్రంలోగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పొత్తులపై మీడియాతో ఇష్టానుసారంగా మాట్లాడారనే అభియోగంపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. పొత్తులపై వివిధ సందర్భాల్లో విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లని బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. బీజేపీ ఢిల్లీ పెద్దల సూచనలతో బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
More Stories
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన
జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు కోరిన సీబీఐ
పోలవరం పునరావాసంకు `ప్రత్యేక సెస్’