ఈ-ఫయిలింగ్స్ కోసం కోర్టులు సిద్ధం అవుతున్నాయని, కానీ ఒకసారి ఈ-ఫయిలింగ్ జరిగితే, అప్పుడు మళ్లీ ఫిజికల్ ఫయిలింగ్ అవసరం ఉండకూడదని సీజేఐ తెలిపారు. పేపర్లెస్, వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలన్న విజన్ తనకు ఉన్నట్లు చెప్పారు. అయితే, పారదర్శకత కోసం కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం గురించి మాట్లాడుతూ, న్యాయమూర్తులు భాష, న్యాయస్థానాలలో తన ప్రవర్తన పట్ల జాగురతతో వ్యవహరించాలని హెచ్చరించారు.
ఐఏఎస్ అధికారిని అనుచితంగా దుస్తులు ధరించారని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి పేర్కొనడం, ఆమె ఎందుకు సిద్ధం కావడం లేదని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఒక మహిళా న్యాయవాదిని అడగడం వంటి క్లిప్లు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయని సీజేఐ చంద్రచూడ్ గుర్తు చేశారు. కోర్టు వ్యవహారాలు ‘అత్యంత సీరియస్’గా ఉన్నాయని, న్యాయమూర్తులు చెప్పే ప్రతి మాట ఇప్పుడు బహిరంగం అవుతుందని అంటూ అందుకనే వారికి శిక్షణ అవసరమని ఆయన స్పష్టం చేశారు.
కోర్టులలో, తీర్పులు రాసేటప్పుడు ఉపయోగించాల్సిన లింగ-అనుచిత పదాలపై చట్టపరమైన పదకోశంను సుప్రీంకోర్టు ప్రారంభించనుందని చంద్రచూడ్ తెలిపారు. సుప్రీం కోర్టు ఎల్జిబిటిక్యూ హ్యాండ్బుక్ను ప్రారంభించిందని, అదే విధంగా తాము కోర్టులలో తప్పించుకోవడానికి లింగసంబంధ అనుచిత పదాలను రూపొందిస్తున్నామని చంద్రచూడ్ ప్రకటించారు.
సెక్షన్ 376పై తీర్పును ఎవరైనా చదివితే, “బాధితురాలిని అప్పీలుదారు విధ్వంసం చేశారు”, “ఆమె ఒక ఉంపుడుగత్తె” వంటి పదబంధాలు కనిపిస్తాయని చంద్రచూడ్ చెప్పారు. గ్లాసరీ న్యాయవ్యవస్థను ‘తక్కువ’ చేయదని, ఉపయోగించే పాదాలకు సంబంధించినంతవరకు భాషపై శ్రద్ధ చూపుతుందని హామీ ఇచ్చారు. న్యాయస్థానాలలో భాషను ఉపయోగించడం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉందని గుర్తు చేశారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!