తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తుకు టీఎస్పీఎస్సీ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ సోమవారం హాజరయ్యారు. వారి ఇద్దరి స్టేట్మెంట్ను ఇడి అధికారులు నమోదు చేశారు. ఉదయం11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 10 గంటలకు పైగా ప్రశ్నించింది.
ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగులు కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నారా? అని ఆరా తీసినట్లు తెలిసింది. వీరితోపాటు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) సిబ్బందిని కూడా ఈడీ విచారించింది. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలతో స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్లు తెలిసింది. ముగ్గురు గురుకుల పాఠశాలల సిబ్బంది నుంచి రేణుకకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
ఇద్దరు నిందితులు, ఇద్దరు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా జనార్దన్రెడ్డి, అనితా రామచంద్రన్, టీఎస్టీఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. టీఎస్టీఎస్ నుంచి టీఎస్పీఎస్సీలో చేరిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సోమవారం రాబట్టినట్లు తెలిసింది.
ప్రశ్నాపత్రం తయారీకి ఎంత మంది నిపుణులు పని చేశారని చైర్మన్ను ప్రశ్నించినట్లు సమాచారం. నిపుణుల వివరాలను కూడా సేకరించినట్లు సమాచారం. నిపుణులతో టీఎస్పీఎస్సీలో ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని అడిగినట్లు తెలిసింది. పేపర్ సిద్ధమైన తర్వాత కస్టోడియన్స్గా ఎవరెవరు ఉంటారనే వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికీ ఈ కేసులో టీఎస్పీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మితో పాటు ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ నుంచి ఇప్పటికే అధికారులు స్టేట్మెంట్ లను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ కొనుగోలులో మొత్తం రూ. 31 లక్షల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులో మనీలాండరింగ్ జరిగినట్లుగా ఆధారాలు లభించడంతో ఈడీ కూడా విచారణ ప్రారంభించింది.గతంలో పేపర్ లీక్ కేసుకు సంబంధించిన మొత్తం 8 డాక్యుమెంట్ల ఇవ్వాలని కోరింది. అయితే ఈడీ లేఖకు సిట్ అధికారులు స్పందించకపోవడంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించింది.
కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ తెలిపింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. టిఎస్పిఎస్సి కేసులో ఆర్థిక లావాదేవీలపై ఇడి దృష్టి పెట్టింది. పబ్లిక్ డొమైన్ ద్వా రా ఇప్పటికే వివరాలు సేకరించిన ఇడి ఇసిఐఆర్ నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతు లు మారాయని గుర్తించింది.
ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా అతనికి నోటీసులు జారీ చేసింది.
More Stories
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు
రిజర్వేషన్లు తీసేస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం